హైదరాబాద్ ఐటీసీ కమ్యూనిటీ రోడ్డు (కోహినూర్ రోడ్డు) వద్ద చిరు వ్యాపారులపై జరుగుతున్న దౌర్జన్యాలు, అక్రమ వసూళ్లు మరియు స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ నిరసనలపై సమగ్ర ప్రకటన.

తేదీ: సెప్టెంబర్ 13, 2026 స్థలం: హైదరాబాద్ విషయం: హైదరాబాద్ ఐటీసీ కమ్యూనిటీ రోడ్డు (కోహినూర్ రోడ్డు) వద్ద చిరు వ్యాపారులపై జరుగుతున్న దౌర్జన్యాలు, అక్రమ వసూళ్లు మరియు స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ నిరసనలపై సమగ్ర ప్రకటన. హైదరాబాద్‌లోని ఐటీసీ కమ్యూనిటీ రోడ్డులో జీవనం సాగిస్తున్న నిజమైన పేద చిరు వ్యాపారుల పొట్ట కొడుతూ, నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వేళల్లో అన్యాయంగా తొలగిస్తున్న అక్రమాలపై ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరి కోసం ఈ ప్రెస్ నోట్ విడుదల చేయడమైనది. ప్రధాన సమస్యలు మరియు అక్రమాలు: అక్రమ దందాలు - వసూళ్లు: ఇంతకుముందు ఇదే తరహా మోసాలకు పాల్పడి జైలుకెళ్లివచ్చిన గంగారామ్, మళ్లీ బయటకు వచ్చి అదే పాత అక్రమ దందాలకు తెరలేపాడు. కేవలం 14 షెడ్లకు మాత్రమే పర్మిషన్ తెచ్చుకుని, రోడ్డు మీద కష్టపడే అసలైన పేదలను మోసం చేస్తూ కొత్త వాళ్లకు రూ. 100 బాండ్ పేపర్లపై అగ్రిమెంట్లు రాసిస్తూ ఫోన్‌పేల ద్వారా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాడు. అధికారుల మౌనం: చేతిలో కోర్టు డాక్యుమెంట్లు, బాండ్ పేపర్లు, ఫోన్‌పే ట్రాన్సాక్షన్ల పక్కా ఆధారాలున్నా.. బాధ్యులైన అధికారులు స్పందించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రజా సమస్యలను పైస్థాయి అధికారులకు, ముఖ్యంగా సీఎంఓ ఆఫీస్‌కు, హెచ్ఎండిఏ కమిషనర్‌కు చేరకుండా కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి: ఈ అక్రమ వసూళ్ల ద్వారా వస్తున్న డబ్బులు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సింది పోగా, స్వార్థపరుల జేబుల్లోకి వెళ్తూ ప్రభుత్వానికి రావాల్సిన రాబడికి గండి కొడుతున్నాయి. బాధిత చిరు వ్యాపారుల న్యాయమైన డిమాండ్లు: దోపిడీకి, దౌర్జన్యాలకు తెగబడుతున్న వ్యక్తులపై మరియు వారికి సహకరిస్తున్న కిందిస్థాయి అధికారులపై తెలంగాణ డీజీపీ, పోలీస్ శాఖ, మరియు హెచ్ఎండిఏ (HMDA) ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి. నిరాశ్రయులైన స్ట్రీట్ ఫుడ్ చిరు వ్యాపారులకు న్యాయం చేసి, వారి ఉపాధికి భద్రత కల్పించాలి. ప్రభుత్వానికి చెందవలసిన ఆదాయాన్ని దారి మళ్లిస్తూ, వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కోహినూర్ రోడ్, ఐటీసీ ప్రాంతంలో స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఎదుర్కొంటున్న ఈ సమస్యలపై మరియు మా డిమాండ్ల సాధన కోసం నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్యమానికి మద్దతుగా పలువురు ప్రముఖులు విచ్చేసి సంఘీభావం తెలుపుతున్నారు. పాల్గొంటున్న ముఖ్య అతిథులు / నాయకులు: ఎ. భాను చారి: వైస్ చైర్మన్, నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ శ్రావణి: ఎగ్జిక్యూటివ్ మెంబర్, నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఉద్యమ బాధ్యులు & కార్యకర్తలు: మహేష్ యాదవ్, రవి, సాయి, రాము, నగేష్, ఆదిల్, సృజన, శ్రావ్య తదితరులు.

Related Articles